హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా వైద్యం ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. అందులో భాగంగానే మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కి చేరుకుంది. మృతుల సంఖ్య 375కి పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm