నవతెలంగాణ కంటేశ్వర్
ప్రతి వారిలో కొత్త ఆశలు చిగురించాలి అని సుఖ సంతోషాలతో తులతూగాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ పాత సుదర్శన్ అన్నారు. మంగళవారం నగరంలోని కిషన్ గంజ్ లో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ వాసవి క్లబ్ వనితా ఇందూరు ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సరి కొత్త ఆశలు చిగురించాలి అని ఆకాంక్షించారు. శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ వాసవి క్లబ్ వనితా ఇందూరుఆధ్వర్యంలో ప్రముఖ పండితులు ప్రశాంత్ జోషి సిద్ధాంతి రచించిన పంచాంగ శ్రవణాన్ని ఆవిష్కరించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల వీరేశం నూతన సంవత్సరం అందరికి సుఖసంతోషాలు ప్రసాదించాలని అన్నారు. వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు గాదె సుదర్శన్ గుప్త మాట్లాడుతూ ప్లవ నామ సంవత్సర ఉగాది ప్రతి ఇంట సరి కొత్త ఆశలు చిగురించాలని, కన్న కలలు నెరవేరాలని సుఖసంతోషాలతో ప్రజలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ ఇంచార్జ్ తాటి వీరేశం, జోన్ చైర్మన్ భా శెట్టి విశ్వనాథం, అన్నాజీ ఒడ్డెన్న గాలి కిష్టయ్య, మోతుకూరి సుధాకర్, చల్ల గంగాధర్, రాజశేఖర్ వాసవి వనిత క్లబ్ కోశాధికారి పాల్తి రేఖ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం పురోహితులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 04:49PM