- నూతన సంవత్సరములో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
నవతెలంగాణ -మంథని
ప్లవ నామ సంవత్సరంలో ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను పారద్రోలాలని పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.మంగళవారం మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎక్లాస్ పూర్,గంగపురి,లక్కే పూర్, ఖానాపూర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, అయన ప్రజలకు సూచించారు.ఈ సంవత్సరంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని,ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు సమయంలో రైతులకు సమస్యలు తలెత్తకుండా జిల్లా అధికారులు,ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండలన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు వచ్చే రైతులు తప్పనిసరిగా 17 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని తీసుకు రావాలని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.అనంతరం సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా,కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు వచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని,ఏ గ్రేడ్ రకానికి రూ.18.88 సాధారణ రకానికి రూ.18.66 ధర పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, జెడ్పిటిసి తగరం సుమలత, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆకుల కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రాంభట్ల సంతోషిని -శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తగరం శంకర్ లాల్, గ్రామ సర్పంచ్ సదానందం,ఎంపిటిసి పెండ్లి చైతన్య-ప్రభాకర్, సింగిల్విండో ఉపాధ్యక్షులు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల సత్యనారాయణ, ఎక్కేటి అనంతరెడ్డి, మంతని లక్ష్మణ్, బడికల శ్రీనివాస్, లెక్కల కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 05:01PM