నవ తెలంగాణ-మంథని: ఉగాది పర్వదినం, తెలుగు నూతన సంవత్సరం పురస్కరించుకొని మంథనిలో మంగళవారం వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో భాగంగా మంథనిలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ పాలక వర్గం, కూచిరాజు పల్లి గ్రామం లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో రంగులు ఇచ్చి, వేసిన ప్రదాత దూడపాక నరేష్ కు సాహితీ కళా సేవా సంస్థ సేవ రత్నం అవార్డు ప్రశంసా పత్రంను అంబటి నర్సింగ్ కు లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో షడ్రుచుల పురస్కార కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యులు నిర్వహించి పలువురికి ఘన సన్మానం చేశారు. ఆరుకళలకు సంబంధించిన కళాకారులకు చిరు సత్కారంను పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ చేతుల మీదుగా వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులకు పలువురికి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, జెడ్పిటీసీ తగరం సుమలత, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆకుల కిరణ్, దేవాలయ చైర్మన్ ఓల్లాల అశోక్, డైరెక్టర్లు వేల్పుల సామ్రాట్, దిగంబర్, బుద్ధర్తి రాణి, తాటివాసు గౌడ్, గొబ్బూరి వంశీ, టిఆర్ఎస్ నాయకులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 05:05PM