నవ తెలంగాణ-మంథని
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్, అజాతశత్రువు, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 22వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి. శ్రీధర్ బాబు శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని నియోజక వర్గ ప్రజల అభివృద్ధిని కాంక్షించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అజాతశత్రువు గా పేరున్న స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు చేసిన సేవలు ఈ ప్రాంత ప్రజలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు చేసిన గొప్ప వ్యక్తి శ్రీపాదరావు అని, ఆయన చేసిన సేవలు ఈ ప్రాంత ప్రజలు మరువలేరని శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంథని నియోజక వర్గ మారుమూల ప్రాంతాల అభివృద్ధికి శ్రీపాద రావు పాటుపడ్డారని ఆయన పేర్కొన్నారు.శ్రీపాదరావు చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నడవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగాది పచ్చడి, బూరెలను శ్రీధర్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కవులను కళాకారులను సన్మానించి, మంథని నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 05:07PM