నవతెలంగాణ గోవిందరావుపేట
కొత్తవారికి,అపరిచితులకు గుత్తి గూడెంలో ఆశ్రయం కల్పించ వద్దని పసర సీఐ అనుముల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని మచ్చా పురం గ్రామ సమీపంలోని గుత్తి కోయ గుంపు తో పసర పోలీసులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో గుంపులోకి కొత్త వారు ఎవరైనా వస్తే వెంటనే సమాచారం అందించాలని ఆయన అన్నారు. చెప్పా పెట్టకుండా కొత్త వారికి ఆశ్రయం కల్పిస్తే మీరు ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిషేధించబడిన విప్లవ గ్రూపులు సంఘ విద్రోహక శక్తులు సంచరిస్తున్న నేపథ్యంలో తాము హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గూడెంకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. అంతేగాని అవసరానికి వాళ్లు చెప్పే మాటలు నమ్మి వారికి ఆశ్రయం కల్పించడం కానీ వారితో వెళ్లడం కానీ చేయవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవీందర్ తెలంగాణ పోలీసులు సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 05:18PM