నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 6వ రాష్ట్ర మహాసభలు మహబూబ్నగర్లోని ఎస్విఎస్ వైద్యకళాశాలలో నిర్వహించడం జరిగిందని పద్మశ్రీ అవార్డు గ్రహిత జాతీయ మెడికల్ కమీషన్ చైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి నిజామాబాద్ నుండి సైకియాట్రిక్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాతీయ ఇండియన్ సైకియాట్రిక్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఆకుల విశాల్ ఆహ్వానం అందుకొని హాజరవ్వడం జరిగింది.ఈ సంధర్బంగా 6వ మహాసభలలో రాష్ట్రస్థాయిలో డాక్టర్ ఆకుల విశాల్ సేవలను గుర్తించి వారిని అభినందించి ఉత్తమ విశిష్ట పురస్కారంతో గౌరవించడం మా అదృష్టంగా భావిస్తున్నాము అని జాతీయ మెడిక్ల్ కమీషన్ చైర్మన్ డాక్టర్ ఎస్.వి. గంగాదర్ తెలిపారు. ఈ సంధర్బంగా డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతు మున్ముందు ఇంకా ఉత్సాహంతో ప్రజలకు సేవా కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అందిస్థానని తెలిపారు. మీరు అందించి సత్కరించిన పురస్కారం నాకు ఎంతో భాద్యతను పెంచిందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 05:49PM