నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకొని జయంతి ఉత్సవాలను గ్రామ సర్పంచ్ పోతి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తక్కల్ల నర్సారెడ్డి, ఉప సర్పంచ్ చేపూరి రాజు, సొసైటీ చైర్మన్ భూమిరెడ్డి, సి డి సి మాజీ చైర్మన్ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ పైతరి స్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమృత రెడ్డి, నాయకులు ఎడ్ల రాజిరెడ్డి, రెడ్డి గారి రమేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు అశోక్, పెద్ద ఎత్తున గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 05:42PM