నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో దళితుల అభివృద్ధికి తమ వంతుగా సహాయం చేస్తున్న సి డి సి మాజీ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, దుబ్బ గౌడ్ లను గ్రామ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గ్రామ సంఘ అధ్యక్షుడు అశోక్ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ చేపూరి రాజు, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు పైతరి స్వామి, డిసిసిబి చైర్మన్ రాజిరెడ్డి, పెద్ద ఎత్తున అంబేద్కర్ సంఘ సభ్యులు, దళిత సోదరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 05:44PM