నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని స్థానిక గిద్ద అర్జున వాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టి గిని శంకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడువాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు మైసయ్య, ఎల్లయ్య, బాలరాజు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 05:45PM