- బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్
నవతెలంగాణ కంటేశ్వర్
రాజ్యాంగ బలోపేతానికి బహుజనులు పోరాడాలి అని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ పిలుపునిచ్చారు ఈ మేరకు బుధవారం భారత రాజ్యాంగ నిర్మాత విశ్వ జ్ఞాని డాక్టర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బిఎల్ పి,బిఎల్ టియు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సుభాష్ నగర్ లోని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి బైక్ ర్యాలీల పూలాంగ్ లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ
భారత రాజ్యాంగం లేనప్పుడు 85శాతం ఉన్న బహుజనులు బానిసలకంటే హీనంగా బతికేవరన్నారు. ఈరోజు దేశంలో దళిత బహుజన ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం క్రమంగా భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు.
అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆదీనంలోని దాదాపు 44 సెంట్రల్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు తొలగించారని, మరోవైపు ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయబోమంటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందేకదా అన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాలు దళిత బహుజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
85 శాతం ఉన్న దళిత బహుజనులు
రాజ్యాధికారం కోసం పోరాడ్డమే డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను కాపాడినవారం అవుతామన్నారు.
ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ జిల్లా అద్యక్షులు ఎం.శ్యామ్ బాబు, బీఎల్పి జిల్లా కన్వీనర్
కాంబ్లె మధు, బిఎల్ టియు జిల్లా కన్వీనర్ మేకల రాజేందర్, బిఎల్ టియు జిల్లా నాయకులు
టి.రాజకుమార్, బహుజన మహిళా సంఘం జిల్లా కన్వీనర్ బి.రాజామణి, నగర కన్వీనర్ జి.రేఖ,
మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కృష్ణ, శ్రీ కాంత్, శ్రీ శైలం,యాదయ్య,ఎం.ఎల్లయ్య,
బిఎల్పి నగర కన్వీనర్ ఎం.డి.హైమద్ హుస్సేన్, బివైఎస్ నగర కన్వీనర్ హెచ్.దమ్మ,కో -కన్వీనర్
ఎం.డి.నవీద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 05:54PM