నవతెలంగాణ కంటేశ్వర్
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశించిన సమానత్వ సమాజాన్ని నిర్మిద్దాం అని ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ కాలనీ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజాంబాద్ నగర అధ్యక్షులు వేణు మాట్లాడుతూ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన రాంజీ మలోజీ సాక్వాల్ , భీమాబాయి దంపతులకు జన్మించడం జరిగింది. అయితే చిన్నప్పటినుండి అంటరానితనాన్ని కుల వివక్షతను అంబేద్కర్ ఎదుర్కోవలసి వచ్చింది అని అన్నారు. అయినా సమాజంలో అంటరానితనం కులవివక్ష పోవాలని అహర్నిశలు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యా రాజ్యాంగ రచనలో అత్యంత కీలక పాత్ర పోషించి రాజ్యాంగ నిర్మాత మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉన్నారని అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ స్వతంత్ర భారతదేశంలో న్యాయశాఖ మంత్రిగా మరియు ఆర్థికవేత్తగా ,సంఘసంస్కర్తగా తన జీవితాన్ని అంతా భారత దేశంలో ఉన్న ప్రజలందరూ ఆర్థికంగా సామాజికంగా సమానంగా జీవించాలని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి అని, కానీ ఇప్పుడు ఉన్న కొంత మంది రాజకీయ నాయకులు ఇతర మతతత్వ శక్తులు అంబేద్కర్ రచించిన టువంటి రాజ్యాంగాన్ని మరియు రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా చేస్తున్నారని కాబట్టి విద్యార్థులంతా ఇలాంటివారిని ఎక్కడికక్కడ నిలువరిస్తూ, అంబేద్కర్ ఆశించిన టువంటి సమానత్వ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర నాయకులు మారుతి శ్రీకాంత్ వంశీ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 05:59PM