నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి అంటూ బుధవారం సీపీఐ కార్యాలయంలో సీపీఐ, ఎఐటీయుసీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కే.భూమయ్య, ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన చిన్ననాటి నుండే అనేక సార్లు కుల వివక్షకు గురై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నత స్థాయి విద్యనభ్యసించారని అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వాన ఏర్పడినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రస్తుత పాలకులు విఫలం చెందుతున్నారని అన్నారు. కుల, మత విద్వేషాలతో ప్రజలలో వైషమ్యాలు పెంచుతున్నారని అన్నారు. ప్రజలు ఉద్యోగ వర్గం, కార్మికవర్గం గ్రహించాలని, ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నారని దీనివల్ల ప్రజలకు, కార్మిక వర్గానికి ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడావల్సిన అవసరం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సుధాకర్, సీపీఐ నాయకులు కే.రాజన్న, రాజేశ్వర్, రంజిత్, ఏఐటీయూసీ నాయకులు గంగాధర్, ఆలీ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:13PM