నవతెలంగాణ ధర్మసాగర్
అంటరానితనం రూపుమాపడంలో అలుపెరుగని పోరాట యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎల్కుర్తి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొలిపాక జయరాజ్ అన్నారు. బుధవారం బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మండలంలోని ఎలుకుర్తి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా జయంతిని ఘనంగా జరుపుకున్నారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనివాని కొనియాడారు. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయిందని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తోందని పొగిడారు .డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయక్కర్లేదని అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం చిరస్థాయిగా చిరంజీవి పదిలంగా ఉంటుందన్నారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉందన్నారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని అన్నారు.
కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారన్నారు. చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారన్నారు.ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవిగా చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలుకుర్తి అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శులు గాజుల సదానందం, మాదాసి నవీన్,గౌరవ అధ్యక్షులు మాదాసి రమేష్,
ఉపాధ్యక్షులు ఇంద కృష్ణ, సండ్ర శేఖర్,జోగు చిరంజీవి, గ్రామ సర్పంచ్ మాదాసి అరుణ యాదగిరి, ఉప సర్పంచ్ బేర రాజేష్, వైస్ ఎంపీపీ బండారి రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాద కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:19PM