నవతెలంగాణ ధర్మసాగర్
భారతరత్న డాక్టర్ భీమ్ రామ్ అంబేద్కర్130వ జయంతి సందర్భంగా మాస్కులు, పండ్ల పంపిణీ చేయడం జరిగింది. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ కమిటీ హాల్ నందు ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల కన్వీనర్ పుట్ట నవీన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 130 జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మసాగర్ సిఐ బొల్లం రమేష్ యాదవ్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయులు డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అని వారు అనగారిన వర్గానికి రిజర్వేషన్లు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు అనంతరం మాస్కులు మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా ఇంచార్జి సాతూరి వెంకన్న మాదిగ జిల్లా నాయకులు సాతూరి రాజమౌళి స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి గంగారపు సుమన్ కుమార్ అధికార ప్రతినిధి దార విజయ్ కాంత్ మండల యువసేన నాయకులు తుడుములనందకిశోర్ సందీప్ ఆకాష్ రాజ్ ఉప సర్పంచ్ బొడ్డు అరుణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ జాలిగాపు దుర్గయ్య వార్డు మెంబర్లు మాచర్ల ఏలియా కొట్టే విజయ భాస్కర్ బొడ్డు ప్రతాప్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:36PM