నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడమే జార్జిరెడ్డికి నిజమైన నివాళి అని పీ.డీ.ఎస్.యూ జిల్లా ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ అన్నారు. కామ్రేడ్ జార్జ్ రెడ్డి 49వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో పీ.డీ.ఎస్.యూ ఆధ్వర్యంలో నివాళులు అర్పించటం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జ్ రెడ్డి యూనివర్సిటీ లో జరిగే అన్యాయలపై ప్రశ్నిస్తూ, ర్యాగింగ్ కి వ్యతిరేకంగా ప్రగతి శీల భావాలతో విద్యార్ధులను చైతన్య పరచి ప్రతిఘటన ఉద్యమాలు నిర్వహించారు అని అన్నారు. విద్య అందరికి అందుబాటులో రావాలని, శాస్త్రీయ విద్య తో పాటు దోపిడి వ్యవస్థను అర్థం చేసుకోని దాన్ని కూల్చే ఆలోచన విధానం గల విద్యకావలని జార్జి ఆకాంక్షించాడని అన్నారు. మన పాలకులు విద్యారంగాన్ని సరుకుగా మార్చి సామ్రాజ్యవాద శక్తులకు అనుకూలమైన విదేశీ, ప్రైవేట్ యూనివర్సిటీ ఆహ్వానిస్తున్నారని అన్నారు. విద్యను పూర్తిగా కాషాయికరిస్తూ అశాస్త్రీయ భావజాలాన్ని విద్యార్థుల మెదల్లాలో ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అశాస్త్రీయ పద్ధతిలో ఉన్న నూతన విద్య విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జార్జి ఆలోచన విధానం, ఉద్యమ స్ఫూర్తి నేడు ప్రశ్నించే గొంతుకు లకి అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జార్జిరెడ్డి ఆలోచన విధానం వెలుగులో విద్యారంగంలో వస్తున్న మార్పులను వ్యతిరేకిస్తూ, బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడమే జార్జ్ కి నిజమైన నివాళి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జాదవ్ సాయి కృష్ణ, ప్రేమ్ చంద్, మనోజ్, దేవిక, సోను, బాబురావు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:39PM