- తెలంగాణ మాల మహానాడు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు సక్కి గంగాధర్..
నవతెలంగాణ నవీపేట్: అణగారిన వర్గాల ఐక్యతతోనే తమ హక్కులను సాధించుకోవాలి అని తెలంగాణ మాల మహానాడు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు సిక్కిగంగాధర్ అన్నారు. మండలంలోని నందిగామ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. సందర్భంగా గ్రామంలో అంబేద్కర్, బుద్ధ చిత్రపటాలను ఊరేగింపు నిర్వహించి, జెండా ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వక్తలు సక్కి గంగాధర్ తెడ్డు పోశెట్టి, ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ వర్గాలు అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని సూచించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు ఆర్థిక సామాజిక మరియు రాజకీయ రంగాలలో అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలు ఏకమై వారి హక్కులను సాధించుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ప్రభాకర్, రవి వర్మ,బుజ్జి, సంజీవ్, దళిత సంఘాల నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:46PM