నవతెలంగాణ నవీపేట్: మండలంలోని ఫతేనగర్ భూములను నిజామాబాద్ ఆర్డిఓ రవి బుధవారం పరిశీలించారు. సత్య నగర్ గ్రామానికి చెందిన 14 మంది రైతులు తమ భూమి సమస్యలపై ఆర్డిఓ కు దరఖాస్తు చేసుకోగా పరిశీలన నిమిత్తం వచ్చి భూములను పరిశీలించారు. పరిశీలనకు వచ్చిన ఆర్డిఓ ను ఫతేనగర్ లో ఉన్న పదిహేను వందల ముప్పై ఎకరాలకు పట్టాలను కేటాయించాలని గ్రామస్తులు కోరగా పూర్తి వివరాలతో తనను కలవాలని ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మార్వో లతా రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm