నవతెలంగాణ కంటేశ్వర్
ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న 108 అత్యవసర సేవలను మరింత విస్తృతం చేసేందుకు సిబ్బంది అందరు పూర్తి సహాయ సహకారాలు నిరంతరం ఉండాలని మూడు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ బి.సామ్రాట్ అన్నారు. ఇదివరకు కొత్తగూడెం జిల్లాలో ప్రోగ్రాం మేనేజర్ గా పనిచేసి బదిలీపై నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా 108 సిబ్బంది ఆధ్వర్యంలో స్వాగత సన్మాన సభ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో బదిలీలు సర్వ సహజమేనని ఎక్కడికి వెళ్ళినా తమ కర్తవ్యాలను బాధ్యతగా నిర్వహించడం అనేది మన ధర్మం అని అన్నారు. అంతే కాకుండా ప్రజలకు, ప్రభుత్వానికి నమ్మకం కలిగే విధంగా మన అత్యవసర సేవలను అందించాలని ఆయన సూచించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 108 ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వర్తించిన ఈ.కొండలరావు మంచిర్యాలకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పి.వసంతరావు మంచిర్యాల నుంచి బదిలీపై వచ్చారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు ప్రోగ్రాం మేనేజర్ గా వచ్చిన సామ్రాట్ ను, అదేవిధంగా ఈఎమ్ఈ గా బదిలీపై వచ్చిన పి.వసంతరావుకు స్వాగతం పలుకుతూ సన్మానించారు. అదేవిధంగా మంచిర్యాలకు బదిలీపై వెళ్తున్న కొండలరావు సైతం 108 సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందులో భాగంగా వారికి శాలువాలతో సత్కరించి ఫ్లవర్ బొకేను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఏ. సంతోష్ రెడ్డి, రాజయ్య, శివ, మేకల శ్రీనివాస్, వినోద్ కుమార్, దేవరాజు, రాములు, మహమ్మద్ అలీమ్ పాషా, రవి, షేక్ ఆలీం పాషా తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 07:09PM