నవతెలంగాణ: గోవిందరావుపేట
పుస్తక పఠనం ద్వారా సమాజాన్ని అధ్యయనం చేసుకోవచ్చనీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహా రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ గ్రంధాలయాన్ని ఆయన ప్రారంభించారు. మొదట బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పసరగ్రామంలోని 163 జాతీయ రహదారి పై వున్న కూడలిలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసీ అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు. అనంతరం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేదిక నుండి నర్సింహారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎదుగుదలకు గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం లండన్ ద్వారా చదివిన ముగ్గురు కారల్ మార్క్స్ బి.ఆర్.అంబేద్కర్ అలెగ్జాండర్ చరిత్రలో ప్రఖ్యాత స్థానంలో లో నిలిచిపోయారని ఆయన అన్నారు. నిరుద్యోగ యువకులకు కాంపిటీషన్ మాత్రమే కాకుండా గ్రంథాలయాలు సమాజాన్ని చదవడం కోసం మరియు మానసిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ఉపయోగపడతాయి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. పుస్తకాల అధ్యయనం ద్వారా సమాజాన్ని తెలుసుకున్న యువత సమాజాన్ని మార్చేందుకు ఇతోధికంగా దోహదపడుతుందని విషయం తెలుసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో ఒక గుడి ఉన్నట్లే ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉంటే ప్రతి గ్రామంలో ప్రపంచం మేధావులను తయారు చేయవచ్చు అని ఆయన అన్నారు. పోటీపరీక్షలకు కాకుండా సమాజం పట్ల తాము ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా గ్రంధాలయాలు పుస్తక పఠనం ద్వారా సమాధానం చెబుతారని ఆయన అన్నారు. ప్రభుత్వాలే బాధ్యతాయుతంగా ప్రతి గ్రామంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు పుస్తక పఠనం ఒక మంచి అలవాటుగా తయారు చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. పసర గ్రామంలో భగత్ సింగ్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన యువతకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన సభావేదికపై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీరెడ్డి సాంబశివ, యుటిఎఫ్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కిరణ్, కార్యదర్శి ఆర్ వాసుదేవ రెడ్డి, డిటిఎఫ్ జిల్లా నాయకులు చాప బాబు దొర, యుటిఎఫ్ వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి, యుటిఎఫ్ జిల్లా నాయకులు మరి అరుణ, ఎంపీటీసీ స్వరూప, సర్పంచ్ రాము, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వెంకన్న, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్, నిర్వహణ కమిటీ సభ్యులు యాకూబ్ పాషా, వేణు, నూకల బాలకృష్ణ, వై.రాజు, రామకృష్ణ, రమేష్, అశోక్ గుండు, లెనిన్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 07:37PM