నవతెలంగాణ కంటేశ్వర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకొని సిపిఎం ఆధ్వర్యంలో బహుజన కాలనీలో చలివేంద్రాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ప్రారంభించారు. అనంతరం కాలోని ప్రజలతో సహపంక్తి భోజనాల్లో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) నగర కార్యదర్శి గోవర్ధన్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల వివక్షతను ఎదుర్కొని, మొక్కవోని దీక్షతో ప్రపంచ మేధావి అని చెప్పుకునే విధంగా విద్యను అభ్యసించి ప్రజలకు అనేక సేవలు చేశారని అన్నారు, నేడు కమ్యూనిస్టులు కోరుకొని పోరాడేది, అంబేద్కర్ ఆలోచనా అభ్యుదయ భావాలు ఒకే విధంగా ఉన్నాయన్నారు. అవి ఆచరణ రూపం లోకి తీసుకురావడం కోసం కమ్యూనిస్టులు అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో ప్రజలను అంటిపెట్టుకుని ఉండి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం అంబేద్కర్ పై పాట రాసి పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కటారి రాములు,బహుజన కాలనీ సేవా సొసైటీ నాయకులు మున్నాభాయ్, బాల్ లింగం, అలీ సాయిలు, మారుతీ, ప్రవీణ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 07:42PM