నవతెలంగాణ: గోవిందరావుపేట
గోవిందరావుపేట. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోన్నతులు బదిలీలు షెడ్యూల్ను తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దసరా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆర్ వాసుదేవ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న పాఠశాలలను తెరిచి నడిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భంగా సంబంధిత జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయుల కు 2000 నగదు ప్రకటించిన విధంగానే విద్యా వాలంటీర్ లకు గెస్ట్ టీచర్లకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న లకు కూడా ఆర్థిక సహాయం అందించాలని ఆయన అన్నారు.కరుణ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా ప్రభావం లేని ప్రాంతాలలో పాఠశాలను నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.బద్దం, వెంకటరెడ్డి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి దుప్పటి కిరణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మది అరుణ, జిల్లా కోశాధికారి పొడెం సమ్మయ్య, జిల్లా కార్యదర్శులు కె.చెంచయ్య, ఎం.వెంకటస్వామి , ఈక.లక్ష్మీనారాయణ, కే.రఘురాం, స్వరూప, కే సమయ, బి.ఉరులల్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 07:55PM