నవతెలంగాణ కంటేశ్వర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా రైల్వే కమన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి కంటేశ్వర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో మనువాదానికి వ్యతిరేకంగా మనుషులంతా సమానమే అనే భావనతో అందరికీ సమాన హక్కులు లభించాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాశారు. ప్రజల హక్కుల పై పోరాడారని వాటిని తూట్లు పొడిచే పద్ధతుల్లో నేటి పాలకులు మనువాద సిద్ధాంతాన్ని అనుసరిస్తూ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందకుండా పోతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, రిజర్వేషన్లను ఎత్తివేయడంతో పాటు అగ్రవర్ణాలకు అనుకూలంగా పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ పరిరక్షణ కై మనువాద సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితంగా పోరాడిన అప్పుడే అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడబడుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శివరాజ్, బాలయ్య,నర్సింగ్ కానిస్టేబుల్,రాజన్న,సిద్ధం రాజేందర్, మాధవి, మల్లికార్జున్, ప్రభాకర్, విన్ను, నితిన్, అఖిల్, నిఖిల తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 08:00PM