నవతెలంగాణ డిచ్ పల్లి.
రైతులకు మద్దతుగాసెప్టెంబర్ 27న భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్ధతు తెలుపుతుందని దీనిని ప్రజలు విజయవంతం చేయాలని దీనిని డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలసని శ్రీనివాస్, మోత్కురి నవిన్ గౌడ్ లు శనివారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరారు. వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అంధకారంలోకి మునిగిందని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధి విధానాల వలన కార్పొరేటీకరణ ముసుగులో రైతన్నలకు ఉరితాళ్లు బిగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సభ్యుల ప్రమేయం లేకుండానే మూజువాణి ఓటుతో మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తీసుకరావడం పిరికిపంద చర్య అని అన్నారు. విద్యుత్ ఉపసంహరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. రైతన్నలకు మద్దతుగా ప్రభుత్వం ఎంఎస్్పి గ్యారెంటీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. రంగరాజన్ కమిటీ సిఫార్సు చేసిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న జరిగే భారత్ బంద్ ను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అమృత పూర్ గంగాధర్ ,జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్యాంసన్ ,సాయిరెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 05:53PM