నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో కొత్త వ్యక్తులు గాని అపరిచిత వ్యక్తులు వచ్చినట్టయితే వారికి ఆశ్రయం కల్పించకుండా పోలీసులకు సమాచారం అందించాలని పసర సిఐ శంకర్ అన్నారు. శనివారం మండలంలోని పసర పరిధిలో ఉన్న కన్నయ్య గుంపు గుత్తిగా గ్రామాన్ని ఎస్సై కరుణాకర్ రావు తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిఐ శంకర్, ఎస్సై కరుణాకరన్ రావు లు మాట్లాడుతూ గుడాల లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. సాధ్యమైనంతవరకు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. గుర్తు తెలియని కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం గుత్తి కోయలు కుటుంబాలకు దుప్పట్లు మందులు పంపిణీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 05:56PM