నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు జంపాల సత్యనారాయణ
నవతెలంగాణ గోవిందరావుపేట
శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలో పుట్టు వెంట్రుకల తీసివేత ద్వారా వచ్చే ఆదాయంలో 33 శాతం వాటాను నాయి బ్రాహ్మణులకు కేటాయించాలని నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు జంపాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల నాయి బ్రాహ్మణ సంఘం సమావేశం ములుగు జిల్లా కార్యదర్శి మల్యాల రామ్ చందర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్యనారాయణ హాజరై మాట్లాడారు.
గత మూడు దశబ్దాలుగా మేడారం జాతర లో పుట్టు వెంట్రుకల ద్వారా వచ్చే ఆదాయం లో 33 శాతం వాటా స్థానిక నాయీ బ్రాహ్మణులకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నా కూడా ఇప్పటివరకు గత ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. న్యాయమైన హక్కులను జిల్లా నాయీ బ్రాహ్మణులు కోరుతున్నప్పుడు హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం శోచనీయమని, ఇకనైనా తమ డిమాండ్ లను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. దళితులకు దళిత బంధు ప్రకటించినట్లుగా తమకు కూడా అదే తరహా లో పథకం ప్రకటించాలని కోరారు. ఉచిత విద్యుత్ పథకం పై అయోమయం నెలకొందని, అధికారులు నాయి బ్రాహ్మణులను సమావేశపరచి లబ్ది చేకూరే విధంగా తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. వెంటనే నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో నాయ బ్రాహ్మణ సంఘం ములుగు జిల్లా అధికార ప్రతినిధిిి మురహరి బిక్షపతి జంపాల చంద్రశేఖర్, వేల్పుగొండ ప్రకాష్, పయ్యావుల సతీష్, నడిగోటి రవీందర్, శంకర్, కొమ్మవరపు సత్య నారాయణ, భగవంతు, కోడూరు శేఖర్, దేవరకొండ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:15PM