నవతెలంగాణ డిచ్ పల్లి.
టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్ మొట్టమొదటి సారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాట్లు పూర్తి చేశారు. గత రెండు రోజులుగా జాతీయ రహదారి వేంట డాక్టర్ గేట్ నుంచి జిల్లా కేంద్రం వరకు ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాట్లు చేశారుచి. ఆదివారం ఉదయం 11:30 గంటలకు జిల్లా సరిహద్దు అయిన ఇందల్ వాయి మండలం లోని చంద్రయాన్ పల్లి నుంచి పెద్ద ఎత్తున జిల్లా కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఐడిసి ఎంఎస్ చైర్మెన్ సాంబరి మోహన్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, జడ్పీటీసీలు సుమన రవి రెడ్డి, దాసరి ఇందిరా లక్ష్మీనరసయ్య, టిఆర్ఎస్ పార్టీ మండలల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శక్కరి కోండ కృష్ణ,ఒడ్డెం నర్సయ్య,పులి శ్రీనివాస్ లు తెలిపారు పార్టీ శ్రేణులు, అభిమానులు సకాలంలో చేరుకోవాలని వారు కోరారు.బైక్ ర్యాలీ ఉంటుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:19PM