నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని స్థానిక బిటిఎస్ చౌరస్తా వద్ద ఉన్న సౌత్ క్యాంపస్ లో రసాయన శాస్త్రంలో చదివి ఫార్మా రంగంలో ఉద్యోగాలు చేస్తున్న పూర్వ విద్యార్థులను శనివారం కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రసాయన శాస్త్రంలో పీజీ చేసిన విద్యార్థులకు ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, పరిశోధన, బోధన రంగంలో విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉందన్నారు. అనంతరం డాక్టర్ సబిత మాట్లాడుతూ విద్యార్థులు యూనివ ర్సిటీకి మంచి పేరు తెచ్చేల రసాయన శాస్త్రం పరిశోధన వైపు అడుగులు వేయాలని విద్యార్థులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో సఫల ఫార్మా కంపెనీ లో ఉద్యోగాలు పొందిన పూర్వ విద్యార్థులు భరద్వాజ, కిషోర్, పాండు, కృష్ణయ్య లను రసాయన శాస్త్ర అధ్యాపకులు సునీత, డాక్టర్ నిరంజన్, డాక్టర్ సబిత, డాక్టర్ హరిత అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:50PM