నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్న కరోనా నివారణ టీకాలు మొదటి విడత ప్రక్రియ 100శాతం పూర్తయినట్టు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం గ్రామంలో 100శాతం పూర్తిచేసేందుకు ఏఎన్ఎం హేమలత ఆధ్వర్యంలో గ్రామ శివారులో ఉన్న పొలాల వద్ద వెళ్లి వారికి వ్యాక్సినేషన్ వేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మట్టే చంద్రకళ మాధవ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ కోసం చేసిన కృషిని మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రవీందర్ నాయక్, ఎంపీవో ప్రవీణ్ కుమార్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:52PM