నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో శనివారం పోషణ పక్షం లో భాగంగా గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు సముహిక శ్రీమంతాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బైండ్ల సులొచన సుదర్శన్ ఆధ్వర్యంలో మహిళలకు శ్రీమంతాలు చేశారు. అనంతరం ఎంపీపీ గాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతా శిశు రక్షణ కు అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి గర్భిణీలకు, బాలింతలకు బలమైన పోషకాహారం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వీరానంద్, ఎంపీడీవో అనంతరావు, ఉప సర్పంచ్ సిద్దా గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణుక తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:54PM