నవతెలంగాణ - అశ్వారావుపేట:
ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగుపై ఆసక్తి చూపుతున్న వంద మంది ఔత్సాహిక రైతులతో జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట,అశ్వారావుపేట మండలాల పరిధిలో ఉన్న పామాయిల్ పంటలు, ఫ్యాక్టరీ లను శనివారం సందర్శించారు. ముందుగా ఖమ్మం నగరం నుండి రెండు బస్సులలో వందమంది రైతులు ఉదయం బయలు దేరారు.ఈ విజ్ఞాన యాత్రను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి జీ.అనసూయ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం దమ్మపేట మండలం లోని అప్పారావు పేట పామాయిల్ కర్మాగారాన్ని (ఫ్యాక్టరీ ని) సందర్శించారు. పామాయిల్ గెలలు నుండి నూనె తీసే విధానాన్ని అక్కడి సిబ్బంది రైతులకు వివరించారు పక్కనే ఉన్న పలేత పామాయిల్ తోటను పరిశీలించారు. ఆ తరువాత 22 సంవత్సరాల ముదురు తోటను దానిలో అంతర పంటగా సాగు చేసిన కోకో తోటను,మిరియాల పంటను,ఇటీవల మొక్కలు నాటిన మొదటి సంవత్సరం తోటలో అంతర పంటగా సాగు చేసిన అరటి పంటను పరిశీలించి అక్కడి రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారిని అడిగి పలు రకాల సందేహాలను నివృత్తి చేస్కున్నారు. అక్కడ నుండి తెలంగాణా రాష్ట్ర నూనె గింజల సహకార సంస్థ (టీ యస్ ఆయిల్ ఫెడ్) అధర్యంలో అశ్వారావుపేట మండలం లో నడుస్తున్న పామాయిల్ మొక్కల పెంపక కేంద్రం ( పామాయిల్ నర్సరీ) ను పరిశీలించారు. అక్కడి సిబ్బంది మొక్కలు పెంచే విధానాన్ని,మొక్కలు నాటే విధానాన్ని రైతులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన మొక్కలు ఇవ్వాలనీ,నర్సరీ సామర్థ్యం పెంచి ఎక్కువ మంది రైతులకు మొక్కలు ఇచ్చేలా ప్రణాళిక లు చేయాలని కోరారు. ఈ ఉద్యాన విజ్ఞాన యాత్రలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి జీ అనసూయ,రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు, ఉద్యాన అధికారులు గుడిమళ్ల సందీప్ కుమార్,ఆకుల వేణు,పి.అపర్ణ, కుమారి మీనాక్షి, గోద్రెజ్ పామాయిల్ కంపెనీ అధికారులు పిల్లి శ్రీనివాస్,దుర్గా ప్రసాద్, ఆయిల్ ఫెడ్ అధికారులు శ్రీకాంత్ రెడ్డి,ఆకుల బాలకృష్ణ, కృష్ణా రావు,కరుణాకర్,ప్రవీణ్,సతీష్,జిల్లా నుండి 100 మంది రైతులు పాల్గొన్నారు..
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 07:00PM