నవతెలంగాణ-మంథని
అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం చేపట్టే భారత్ బందును విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఆదివారం మంథనిలో అఖిలపక్ష ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ మంద బలంతో తీసుక వచ్చిన మూడు వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీ సరిహద్దులోని రైతు సంఘాలు గత 9 మాసాలుగా అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు ఉరితాడుగా మారిన ఈ చట్టాలను రద్దు చేయాలని,అనేక సంఘాలు, రాజకీయ పార్టీల ప్రజా సంఘాలు, ఈ చట్టాలను వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని,రైతులకు కనీస మద్దతు ధర కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 27న భారత్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పుప్పల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఎస్ ఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు మంథని సత్యం, బి ఎస్ ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు జనగామ నర్సింగ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ల.సందీప్, మండల కన్వీనర్ ఎరుకల సాగర్, ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి వేల్పుల మొగిలి, కాంగ్రెస్ నాయకులు అనిల్ రెడ్డి, అన్ని ప్రజా సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 07:04PM