దళిత శక్తి ప్రోగ్రాం (డి.ఎస్.పి) జిల్లా కన్వీనర్ చిలువేరు శ్రీకాంత్ మహారాజు
నవతెలంగాణ-ధర్మసాగర్
బారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు దళితులందరూ ఏకం కావాలని దళిత శక్తి ప్రోగ్రాం (డి.ఎస్.పి )జిల్లా కన్వీనర్ చిలువేరు శ్రీకాంత్ మహారాజు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని ఎల్కుర్తి గ్రామంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దళిత శక్తి ప్రోగ్రాం దళితులను ఏకం చేయడానికి మండల నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ధర్మసాగర్ మండల అధ్యక్షుడిగా మాదాసి కుమారస్వామి మహారాజ్, ప్రధాన కార్యదర్శిగా బంగారపు ఎల్లస్వామి మహారాజు, ఉపాధ్యక్షులుగా పాలుమారి రమేష్ మహారాజు, కార్యదర్శిగా కందుకూరి రఘువీర మహారాజు, కోశాధికారిగా కొట్టే ఏసోబు మహారాజు, కార్యవర్గ సభ్యులుగా మునగాల శ్రీకాంత్ మహారాజు, మునగాల హరీష్ మహారాజు, సాంబయ్య మహారాజు, జోగు శ్రీకాంత్ మహారాజు, చిట్యాల దినేష్ మహారాజు, గంగారపు రాజు మహారాజులను ఆయన ఇరువురు లను ఏకగ్రీవంగా నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 07:08PM