ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరచాలనే డిమాండ్ల ప్రతిపాదనలతో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ కంటేశ్వర్
పాఠశాల విద్యలో ప్రమాణాలను దిగజార్చే రేషనలైజేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరచాలనే డిమాండ్ల ప్రతిపాదనలతో ఉపాధ్యాయ సంఘాలు శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ఏవో కు వినతి పత్రాన్ని అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ. ప్రయివేటు కార్పొరేట్ పాఠశాలలను అనుమతించిన తర్వాతనే ప్రభుత్వ పాఠశాలలు ముతపడుతున్నాయన్నారు. ఇప్పుడు రేషనలైజేషన్ జీ.ఓను అమలుచేస్తే ప్రభుత్వ రంగంలో ఉన్న పాఠశాలలో ప్రమాణాలు పడిపోయి వేలలో ముతపడే ప్రమాదం. ఉన్నదన్నారు. అసలు ఇప్పటికే మొత్తం విద్యారంగం సంక్షోభంలో చిక్కుకున్నదని చెప్పారు. ఈ సంక్షోభాన్ని అర్ధం చేసుకొని పరిష్కారాలు చూపడానికి నిపుణులతో, రిటైర్డ్ న్యాయమూర్తులతో విద్యా రంగంలో పనిచేస్తున్న విద్యావేత్తలతో ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశ పెట్టి సుశిక్షితులైన ఉపాధ్యాయులతో బోధించాలని, 3 నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లలు ఉన్న అంగన్ వాడీలను ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి తీసుకొచ్చి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని యాజమాన్యం లో నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే పిల్లలందరికి ఉదయం టిఫిన్, సాయంత్రం అరటి పండు, పాలు ఇచ్చి హోంవర్క లు చేయించిన తర్వాత ఇంటికి పంపాలన్నారు. మధ్యాహ్న భోజనానికి పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని,. ప్రాధమిక పాఠశాలలో మెదటి 20 మందికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని, ఆ తర్వాత 1: 20 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య 100దాటిన ప్రతి ప్రాథమిక పాఠశాలలో అదనంగా ప్రధానోపాధ్యాయుని నియమించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో స్టాఫ్ ఫ్యాటర్న్ ప్రకారం అన్ని సబ్జెక్టులకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలన్నింటిలో రెసిడెన్షియల్ పాఠశాలల స్థాయిలో హాస్టల్ వసతి ఇతర మౌలిక వసతులు, వనరులు కల్పించాలని కోరారు. స్టాఫ్ ఫ్యాక్టర్స్ ప్రకారం అన్ని సబ్జెక్టులకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించాలని, అలాగే బోధనేతర సిబ్బంది ముఖ్యంగా స్వీపర్, వాచ్ మెన్ లను కూడా రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని, ఒక్క కిలో మీటర్ కన్నా ఎక్కువ దూరంలో ఉన్న అన్ని పాఠశాలలకు రవాణా సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని కోరారు. గుర్తింపులేని పాఠశాలలను, కళాశాలలను స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రయివేటు పాఠశాలలకు అనుమతి ఇవ్వరాదని కోరారు. ప్రభుత్వ రంగంలోనే అవసరం ఉన్నన్ని పాఠశాలలను తెరవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పి శశీతన్, బాలయ్య రాజన్న సురేష్, సుధాకర్ రఘురాం ఆశ నారాయణ,సాయి తేజ దాసు రాజేష్, భానోదయ స్వామి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 07:14PM