నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో సుమారు 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 4 వరసల రోడ్డు నిర్మాణ పనులను పట్టణ సర్పంచ్ తునికి వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 4 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జెడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నందా రమేష్, కామారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల బిక్షపతి, డిసిసిబి డైరెక్టర్లు కిష్ణ గౌడ్, సిద్ధరాములు సొసైటీ చైర్మెన్ భూమయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఆలయ కమిటీ చైర్మెన్ అందె మహేందర్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ బొడ నరెష్, ఎంపీటీసీలు సువర్ణ ప్రభాకర్, చంద్రకళ రాములు, ఉప్పల బాబు, ఆయా గ్రామాల సర్పంచులు నరసింహులు యాదవ్, మధు మోహన్ రెడ్డి, పోతిరెడ్డి, జనగామ శ్రీనివాస్, సొసైటి వైస్ చైర్మన్ ముచ్చర్ల రాజిరెడ్డి, మాజీ సర్పంచులు బండి రాములు, నాగభూషణం గౌడ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబాల్ల మల్లేశం, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతోపాటు మండలంలోని టిఆర్ఎస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 02:17PM