నవతెలంగాణ కంటేశ్వర్
సాయుధ పోరాట యోధురాలు చాకలీ ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా వినాయక నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకుల ఆదివారం వారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఐలమ్మ చరిత్రే నిదర్శనమన్నారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంకు జన్మనిచ్చిన తల్లి ఐలమ్మ అని..ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించు కోవాలని పిలుపునిచ్చారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ ఆ రోజు దేశ్ముఖ్ లను, రజాకార్లకు పరిగెత్తించిన ఐలమ్మ తెగింపును వారసత్వంగా బీసీలు ఎంచుకుని ముందుకు సాగాలని అన్నారు. ఒక్క వీరనారి కొన్ని వేల ఎకరాల భూమిని ప్రజలకు చెందే విధంగా చూడడం ఒక గొప్ప విషయం, తన నాలుగెకరాలభూమిని కాపాడుకోవడమే కాకుండా వేల మందికి భూమిని చెందే విధంగా చూసిన నాయకురాలు గొప్ప ధీశాలి చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె చివరి శ్వాస వరకు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు శ్రమించిందని చెప్పారు. ఆమె బాటలో పయనించి బీసీలు తమ హక్కులను సాధించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరాల సుధాకర్, ధర్శనం దేవేందర్, మాడవేడి వినోద్ కుమార్, వడ్డెర నగేష్, కొయ్యాడ శంకర్, పొదిల శోభా, రాజు, నర్సయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:12PM