నవతెలంగాణ కంటేశ్వర్
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆదివారం ఆమె విగ్రహానికి నూడాచైర్మన్ ప్రభాకర్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూడాచైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను ,పోరాట స్పూర్తినీ ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ. అని అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నూడ అడ్వైజర్ కమిటీ మెంబర్స్ రాజేంద్ర ప్రసాద్, అక్తర్ కన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:15PM