నవతెలంగాణ-భిక్కనూర్టీ
టీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ ఉపాధ్యక్షులుగా నియమితులైన పున్న అఖిల్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదివారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పట్టణంలోని అన్ని వార్డులలో ప్రజలకు వివరించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ పట్టణ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్, యూత్ ఉపాధ్యక్షులు బండారి చంద్రకాంత్, గడికింది చంద్రకాంత్, దినేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి పెద్దోళ్ల శశిధర్ రావు, కోశాధికారి నీరడి సాయి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:18PM