నవతెలంగాణ-భిక్కనూర్
నియోజికవర్గంలోని 10 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుంచి మంజూరైన 07 లక్షల 22 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 945 మందికి 5 కోట్ల 79 లక్షల 55 వేల 300 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుంచి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. అందుకు సంబంధించిన పత్రాలను తమ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మాజీ జెడ్పిటిసి నిమ్మ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:20PM