ఏ ఎస్ పి సాయి చైతన్య
నవతెలంగాణ గోవిందరావుపేట
అన్ని రంగాల్లో వెనుకబడి వలస జీవితాన్ని గడుపుతున్న ఈ ప్రాంత గుత్తికోయలకు సహాయం అందించేందుకు పోలీసులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని ములుగు జిల్లా ఏ ఎస్ పి సాయి చైతన్య అన్నారు. ఆదివారం మండలంలోని మచ్చ పురం సమీపంలోని గుంపులో నివసిస్తున్న గుత్తి కోయ గూడెం ప్రజలను పసర సీఐ శంకర్ తో కలిసీ వారు పరామర్శించి సహాయం అందించారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి సాయి చైతన్య మాట్లాడుతూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా స్థానిక పోలీసులను అడిగి పొందవచ్చని వారికి ఆయన సూచించారు. మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకోవడం వద్దని, కష్టపడి బతికి అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. అపరిచితులకు ఆశ్రయం కల్పించ వద్దని , ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గుత్తి కోయల కు అవసరమైన దుప్పట్లు నిత్యవసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. పిల్లలకు అవసరమైన విద్యాబుద్ధులు చెప్పించేందుకు కూడా తాము సహకరిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ సి హెచ్ కరుణాకర్ రావు పోలీసులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:22PM