నవతెలంగాణ-మంథని : మంథని మున్సిపల్ పరిధిలోని ఆర్డిఓ కార్యాలయం సమీపంలో భారీ చెట్టు కూలిపోయి విద్యుత్ తీగలపై పడడంతో శుక్రవారం మంథని పట్టణంలోని ఆర్డిఓ,తాసిల్దార్ కార్యాలయంతోపాటు పట్టణములోని కొన్ని వార్డుల్లో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.విద్యుత్ తీగలు తెగిపోవడంతో మంథనిలో సుమారు ఆరు గంటల పాటు విద్యుత్ నిలిచిపోవడంతో రెవెన్యూ శాఖతో పాటు పలు వార్డులోని వ్యాపార వాణిజ్య సంస్థలు,కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు,నివాస గృహాల ప్రజలు, అధికారులు,అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు స్తంభించిపోయినవి.దీంతో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.ఆరు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో రెవెన్యూ శాఖ అధికారుల పనుల కార్యకలాపాలు స్తంభించిపోయాయి.రిజిస్ట్రేషన్ లావాదేవీలు నిలిచిపోవడంతో స్లాట్ బుకింగ్ శనివారం నాటికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.విద్యుత్ శాఖ అధికారులు చెట్టును తొలగించడానికి సుమారు ఆరు గంటల పాటు శ్రమించడంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినవి.ఆరు గంటలపాటు పట్టణంలో విద్యుత్కు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు, సంబంధిత వివిధ శాఖల అధికారులు,సిబ్బంది,అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.