- గోల్డ్ లోన్సును ప్రారంభించిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్..
నవతెలంగాణ-మంథని
మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథనిలో బంగారు ఆభరణాలపై ఋణాలను పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా ఇప్పటికే స్వల్పకాలిక,దీర్ఘకాలిక,పర్సనల్ లోన్స్, చిరువ్యాపారులకు ఋణాలు,వాటర్ షెడ్ ఋణాలు అందించడంతో పాటు కొత్తగా గోల్డ్ లోన్స్ అందించడం హర్షనీయమన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో గోల్డ్ లోన్ కౌంటర్ను పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ,సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ లు మాట్లాడుతూ,సహకార సంఘంలో కొత్తగా ప్రారంభించిన గోల్డ్ ఋణాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కమర్షియల్ బ్యాంకులకు దీటుగా సహకార సంఘం ద్వారా అందిస్తున్న ఋణాలను రైతులు,ప్రజలు,వ్యాపారులు,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.ఈ సందర్భంగా పుట్ట దంపుతులను సంఘ పాలకవర్గ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా లీడ్ బ్యాంక్ ద్వారా బెస్ట్ పెర్ఫార్మన్సు అవార్డు పొందిన కెడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ ను సంఘ పాలక వర్గ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించినారు.ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి,డైరెక్టర్లు మాచీడి రాజుగౌడ్,ఆకుల రాజబాపు,పెద్దిరాజు ప్రభాకర్,రావికంటి సతీష్ కుమార్,సిరిమూర్తి ఓదెలు,గడ్డం పోచం, లెక్కల కిషన్ రెడ్డి,కొత్త శ్రీనివాస్,దాసరి లక్ష్మీ, ఉడుత మాధవి,దేవళ్ల విజయ్ కుమార్,ఎంపిపి కొండ శంకర్,జెడ్పీటీసి సభ్యురాలు తగరం సుమలత,రైతుబంధు అధ్యక్షుడు ఆకుల కిరణ్,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్,కెడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్,సిఈఓ మామిడాల అశోక్ కుమార్,ఏఎంసి డైరెక్టర్లు గొబ్బూరి వంశీ,వేల్పుల గట్టయ్య,గౌతమేశ్వర దేవస్థాన చైర్మన్ మేడగోని రాజమౌళి గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jun,2022 06:52PM