నవతెలంగాణ-మంథని
బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభించి వందరోజులు పూర్తవుతున్న సందర్భంగా హనుమకొండలో ఈనెల 26న నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి దళిత సంఘాల నాయకులు,బి.ఎస్.పి నాయకులు,కార్యకర్తలు, మేధావులు,పెద్ద ఎత్తున తరలిరావాలని బీఎస్పీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి మల్లేష్ పిలుపునిచ్చారు.శుక్రవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి,రాష్ట్రంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.అణగారిన ప్రజల రాజకీయ ప్రాతినిధ్యపు ఆకాంక్షలకు అంకురార్పణ చేసిన ఛత్రపతి సాహు మహారాజ్ 148వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బి.ఎస్.పి అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సారధ్యంలో సాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్ర భారీ బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లాలోని నలుమూలల నుండి తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ విలేకరుల సమావేశంలో లో బీఎస్పీ నాయకులు బొంకురి దుర్గయ్య, జనగామ రవి కుమార్,ఏటా సంపత్,బొంకురి అజయ్,తదితరులు పాల్గొన్నారు.