నవతెలంగాణ-మంథని: మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,పాలకవర్గ సభ్యులు బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించారు. ముత్తారం మండలం ఖమ్మం పల్లి గ్రామ నివాసిగా,మంథని మండలంలో సుపరిచితుడు,మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి బ్యాంకులో వివిధ హోదాలో పనిచేస్తూ ఇటీవల కాలంలోనే బ్యాంక్ మేనేజర్ గా పదోన్నతి పొంది,బ్యాంకులలో లావాదేవీలు,వినియోగదారుల సేవలు అందించడం పట్ల లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బెస్ట్ ఉద్యోగిగా అవార్డు పొందిన కేడీసీసీ బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్ ను సింగిల్ విండో పాలకవర్గ సభ్యులు పూలమాలలు,శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ కొండ శంకర్,జెడ్పిటిసి తగరం సుమలత, రైతుబంధు అధ్యక్షులు ఆకుల కిరణ్,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్,సీఈవో మామిడాల అశోక్ కుమార్,డైరెక్టర్లు ఆకుల రాజబాబు,లెక్కల కిషన్ రెడ్డి,రాజు గౌడ్, విజయ్ కుమార్,గొబ్బూరి వంశీ, వేల్పుల గట్టయ్య,రావికంటి సతీష్ కుమార్,ఓదెలు,తదితరులు పాల్గొన్నారు.