నవతెలంగాణ-భిక్కనూర్
దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దళిత బంధు పథకం కింద గ్రామానికి చెందిన రామగళ్ళ దినేష్ కు టెంట్ హౌస్, రాజుకు సెంట్రింగ్ పనిముట్ల దుకాణం కోసం 10 లక్షల రూపాయల చొప్పున అనుమతి పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. దళిత బంధువు ద్వారా దళితులు అభివృద్ధి చెందుతారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ మల్లేష్ మంజుల మల్లారెడ్డి, ఉప సర్పంచ్ బిక్షపతి, మండల కో ఆప్షన్ నెంబర్ ఎస్కే సుల్తానా, ఎంపీడీవో అనంతరావు, ఎంపీవో ప్రవీణ్ కుమార్, ఎమ్మార్వో నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సిద్ధూ రాంరెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jun,2022 06:57PM