- వివరాలు వెల్లడించిన నిజామాబాద్ ఏసిపి
నవతెలంగాణ కంఠేశ్వర్
జిల్లా కేంద్రంలో గత రెండు రోజుల క్రితం 5 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సాయి నగర్ వద్ద జరిగిన కత్తి పోట్ల ఘటనలో లో 24 గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏ సి పి. ఏ వెంకటేశ్వర్ శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.నగరంలో ని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వర్ని చౌరస్తా లో ఇరు వర్గాల మధ్య గత 2రోజుల క్రితం ఘర్షణ చోటు చేసుకుందన్నారు. ఆటో కి సైడ్ ఇవ్వమని అన్నందుకు క్షణికవేషములో కత్తితో దాడులకు పాల్పడ్డారని, అజ్జు ఖాన్ అనే వ్యక్తి అనుచరులను రెచ్చగొట్టతంతో రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారని అన్నారు. 80 క్వార్టర్స్కు చెందిన బట్టు సాయి కుమార్ తన స్నేహితులైన భాను, ప్రభాకర్, విష్ణు, సాయి కృష్ణ తో కలిసి నాగారం వడ్డెర కాలనీ లో తన స్నేహితుడి పెళ్ళికి వెళ్లి అనంతరము ఆటోలో రైల్వే స్టేషన్కు టీ తాగేందుకు వెళ్తున్నారు. సాయి నగర్ వద్ద ఆటో ముందు వెళ్తున్న రెండు బైకులు ఆటోకు సైడ్ ఇవ్వకపోవడంతో డ్రైవర్ సాయి కుమార్ హారన్ కొట్టాడు.బైక్ పై ఉన్న పెయింటర్ కాలనీకి చెందిన ఖాజా ఆటోను ఆపి దాడి చేశాడు. అక్కడే బైక్పై ఉన్న అజ్జూ ఖాన్ రెచ్చగొట్టడంతో జుబేర్, సాదాబ్, సలాం, ఫెరోజ్ లు సాయి కృష్ణ, విష్ణు పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి వీపు వెనుక కత్తిపోట్లు తగిలాయి. దాడి చేసి నిందితులు అక్కడి నుండి పరారయ్యారని తెలిపారు. దీంతో కత్తులతో గాయాలైన వారిని రాత్రి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాందీ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు.ప్రస్తుతం కత్తి పోట్లకు గురైన ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని అన్నారు. బాధితుడు బట్టు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే కేసు దర్యాప్తు లో భాగంగా సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో5 టౌన్ ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ నిందితులను పట్టుకునేందుకు సిబ్బంది తో గాలింపు చర్యలు చేపట్టారని 24 గంటల వ్యవధిలోనే నిందితులను 5 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాబాన్ సాహెబ్ పహాడ్ దర్గా వద్ద శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు కు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తిని ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన నిందితులు ప్రధాన నిందితుడు పెయింటర్ కాలనీకి చెందిన సయ్యద్ కాజా, ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ జుబేర్, ఆటో నగర్ కు చెందిన మహమ్మద్ షాదాబ్, ఆటో నగర్ కు చెందిన షేక్ ఫిరోజ్, లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఏ సి పి ఏ వెంకటేశ్వర్ తెలిపారు. పరారీలో ఉన్న అజ్జు సలాం ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నామని త్వరలోనే త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు. దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరారీలో ఉన్న అజ్జు అనే నిందితుడు పై ఇప్పటికే 7 కేసులు ఉన్నాయని అతనిపై పిడియాక్ట్ కూడా నమోదు చేస్తామని తెలిపారు. యువత క్షణికావేశానికి లోనుకాకుండా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అనవసరపు గొడవలకు వెళ్లొద్దని ఆయన సూచించారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరిగినా తమ సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వస్తున్నారని తెలిపారు. ఈ కేసును త్వరితగతిలో చాకచక్యంగా చేదించిన నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్, 5 వ టౌన్ ఎస్ఐ రాజేశ్వర్గౌడ్, సిబ్బంది వేణు, ఫయాజ్, సలీం, లను ఏసీపీ వెంకటేశ్వర్ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jun,2022 07:39PM