నవతెలంగాణ- సిటీబ్యూరో
ఇస్రో ఆధ్వర్యంలో యువికా కార్యక్రమంపై ఈ నెల 27 న మధ్యాహ్నం 2 గంటలకు టీశాట్ నెట్వర్క్ ద్వారా టెలీకాన్ఫరెన్స్ ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్. రోహిణి, జిల్లా సైన్స్ అధికారి సీ ధర్మేందర్ రావు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న యువ శాస్త్రవేత్తల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎస్ సి ఈఆర్ టి సంచాలకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప విద్యాశాఖ అధికారులు, అన్నీ యాజమాన్యాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థుల అనుమానాలను సైన్స్ ఉపాధ్యాయులు నివృత్తి చేయాలని సూచించారు .
ఇస్రో ప్రతిష్టాత్మకంగా యువ శాస్త్రవేత్తలకు వేదికగా యువికా (యువ విజ్ఞాన కార్యక్రమం ) ప్రతి సంవత్సరమ నిర్వహిస్తోంది. దేశానికి అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణల వైపు యువతను నడిపించడం అంతరిక్షంపై మక్కువను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఇన్ స్పైర్ అవార్డ్స్ మన తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎన్నికైన విద్యార్థులు, ఇస్రో చేపట్టిన యువికా -2022 సంవత్సరంలో తెలంగాణ నుంచి ఎంపికైన ఐదుగురు విద్యార్ధులకు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు రఘునందన్, ఎస్ఆర్టీ ప్రొఫెసర్ పరస్పర చర్చలు టీ శాట్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా మన అందరికీ అందుబాటులో వస్తున్నాట్లు జిల్లా సైన్స్ అధికారి సీ. ధర్మేందర్ రావ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 10:37AM