నవతెలంగాణ-ధర్మసాగర్
శాంతి భద్రతలే ధ్యేయంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు.శుక్రవారం హన్మకొండలోని ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయం నందు ధర్మసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్(సిఐ)గా బదిలీ పై విచ్చేసిన ఒంటేరు రమేష్ కు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి మార్యదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ శాంతిభద్రతల విషయంలో పేద ధనిక అనే తేడా లేకుండా న్యాయంగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం ఆయనకు అందుబాటులో ఉన్న వేలేరు,ధర్మసాగర్ మండలాల ప్రజాప్రతినిధులను మరియు నాయకులను సిఐకు పరిచయం చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మల్లక్ పల్లి సర్పంచ్ మునిగెల రాజు, కర్ర సోమిరెడ్డి,మరిజె నర్సింగరావు , జిల్లా ఆత్మ చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు,తక్కల్లపల్లి ప్రభాకర్ రావు , జిల్లా మత్స్య అభివృద్ధి సంస్థ డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ,శోభసోమయ్య, రమేష్ ,కృష్ణమూర్తి, బత్తుల శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 03:13PM