నవతెలంగాణ కంటేశ్వర్
ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, అర్బన్ ఇన్ చార్జి తాహెర్బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు పి సి సి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గాలలో సత్యాగ్రహ దీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత వారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆవేదన చెందిన నిరుద్యోగ యువత చేసిన సంఘటనలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఎందుకంటే శారీరక పరీక్షలో అర్హులైన అభ్యర్థులు రాత పరీక్ష కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నాలుగు సార్లు పరీక్ష తేదీ నిర్ణయించి మళ్లీ రద్దు చేసిందాన్నారు. నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లకు ఇప్పటివరకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగిందని ,అగ్నిపథ్ ను రద్దు చేయాలని యువత అధికారులకు మెమోరాండం ఇచ్చినా కూడా యువత కోరికను పక్కనపెట్టి దేశ యువతను జీవితకాలం నిరుద్యోగులుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపత్ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన సంఘటన నిరుద్యోగులు అగ్నిపథ్ వల్ల ఆవేదన చెందడం వల్ల జరిగిందని, నిజానికి ఈ దేశం ఆస్తి నష్టం చేయడం వారి ఉద్దేశం కాదని, ప్రభుత్వం దీనిని అర్థం చేసుకోవాలని యువత పై పెట్టిన కేసును రద్దు చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని మోహన్ రెడ్డి అన్నారు.
అరెస్టయిన యువతను పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కలిసి వారికి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం జరిగిందని, అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిజామాబాద్ అర్బన్ లో ధర్నాచౌక్ వద్ద అర్బన్ ఇన్చార్జ్ తాహెర్బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో , ఆర్మూర్ లో అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ,బాల్కొండలో బస్టాండ్ వద్ద బాల్కొండ ఇన్ చార్జ్ ఈరవత్రి అనిల్ ,మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో, నిజామాబాద్ రూరల్ లో బోర్గాం చౌరస్తా వద్ద రూరల్ ఇన్ చార్జ్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో, బోధన్ లో అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సత్యగ్రహ దీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అగ్నిపథ్ రద్దు చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత పక్షాన పోరాటం చేస్తుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు.ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి రాంభూపాల్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వికీ యాదవ్, రాష్ట్ర ఎన్ఎస్ యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్ ,జిల్లా ప్రభా గండ కమిటీ చైర్మన్ జావిద్ అక్రమ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేశ మహేష్ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జాహెద్ బిన్ హందాన్, అయ్యుబ్, నరేందర్ గౌడ్ ,చింటూ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 03:40PM