బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ
నవతెలంగాణ కంటేశ్వర్
దేశం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని మనమంతా గౌరవించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్ సూర్య నారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం ఇందూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమర్జెన్సీ సమయంలో పోరాడిన నాయకులని సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం, ధర్మం కోసం, సిద్దాంతం కోసం ఎమర్జెన్సీలో జైల్ పాలైన ఉల్సా రాజేశ్వర్, కోల ఆంజనేయులు, పుప్పాల రాజేందర్, వెంకట్ రెడ్డి, శ్రీధర్ ల ధైర్యాన్ని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కి నేటికి 47సంవత్సరాలయ్యాయని, రాయ్ బరేలి ఎన్నికపై ప్రత్యర్థి రాజ్నారాయణ్ అప్పటి ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీపై హై కోర్టుకు వెళ్లగా డబ్బు, ఆమె అధికార దుర్వినియోగంతో గెలిచారని ఎన్నిక చెల్లదని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పురావడం జరిగిందని అన్నారు. దీనిపై ఇందిరాగాంధీ సుప్రింకోర్టుకు వెళ్లినా సుప్రింకోర్టు సైతం ప్రధానిగా కొనసాగాలని, కానీ ఎంపి పదవి చెల్లదని తీర్పు రావడం, కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఉన్నా ప్రాంతీయ పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బలం పుంజుకుంటుండగా, ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిందన్నారు. విషయాన్ని గ్రహించి అప్పటి రాష్ట్ర పతి ఫారుక్ అబ్దుల జూన్ 25, 1975న ఎమర్జన్సీ విధించారని గుర్తు చేశారు. దీంతో దేశంలో అరాచకాలు పెరిగి పోయాయని, మీడియా పైనా ఆంక్షలు పెరిగిపోయయని అన్నారు. దీన్ని స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ తరపున ప్రతి సంవత్సరం కూడా భవిష్యత్తులో యువతరానికి ఇలా జరిగిందని.. దేశంలో ఇదొక మచ్చ అని.. కాంగ్రెస్ చేసిన పాపం మరిచిపోకుడదని అన్నారు. దేశ వ్యతిరేక శక్తులను దృష్టిలో పెట్టుకొని మన సత్తా చాటాలని అన్నారు.
తెలంగాణలో ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల వ్యతిరేక విధానాలు, ఏక పక్షనిర్ణయాలతో ప్రజలు అండగా లేరని అల్లర్టు సృష్టిస్తుందన్నారు. సికింద్రాబాద్లో జరిగిన అల్లర్లు అని అన్నారు. 21నెలల ఎమర్జన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైందన్నారు. ప్రతతీసంవత్సరం ఆనవాయితీగా భారతదేశ చీకటి రోజుగా స్మరించుకుంటున్నామన్నారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్రం అట్టడుగు వర్గాలు సభ్కా సాత్ సభ్కా వికాస్ నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. పెద్దలు భారతీయ జనతాపార్టీ జన్సంఘ్, ఆర్ఎస్ఎస్ చూపిన బాటలో ముందుకు సాగుతున్నామన్నారు. భవిష్యత్తులో ఎమర్జెన్సీ పునరావృతం కాకుడదని ఎమర్జెన్సీకి కారణం అయినా కాంగ్రెస్ పార్టీని రానున్న రోజుల్లో పూర్తిగా భూస్థాపితం చెయ్యాలిన బాధ్యత దేశ ప్రజల మీద ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు న్యాలం రాజు, పోతన్కర్ లక్ష్మి నారాయణ,జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, పంచరెడ్డి శ్రీధర్, ఇప్ప కాయల కిషోర్, ప్రమోద్, స్వామి యాదవ్, బద్దం కిషన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 04:00PM